,ఎన్టీఆర్ లలితకళాతోరణం భవనం పూర్వ వైభవం తీసుకురండి..

Sakshitha news

ఎన్టీఆర్ లలితకళాతోరణం భవనం పూర్వ వైభవం తీసుకురండి……………..పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక*యోగా గురువు ఓంకార్
కూచిపూడి కళల అకాడమీ నీరజాదేవి
కరాటే మాస్టర్ శేఖర్


సాక్షిత వనపర్తి
*వనపర్తి పట్టణంలో పాత బస్టాండ్‌లో ఉన్నా ఎన్టీఆర్‌ లలితకళాతోరణం భవనం గతం లో సాహితి, కూచిపూడి, యోగా, కరాటే, సంగితం, ఎన్నో సమాజిక కార్యక్రమాలు జరిగేవి, గత 8 సంవత్సరాల నుండి మునిసిపాలిటీకి సంబంధి చిన్నా, పాతసామానులు, బ్లీచింగ్ బ్యాగులు, సున్నం సంచులు, గదులలో ఉంచా దాము వల్లన కార్యక్రమాల కు సమస్య గా ఉంధి. కావున ఎన్టీఆర్ లలితకళాతోరణం భవనంలో ఉన్నా మున్సిపాలిటీ. సామానులు ఖాళీ చేహించి లలితకలాతోరణం భవనం సాహితీ , కళలు, యోగా, కరాటే సామాజిక కార్యక్రమాలకు నిర్వాహణకు అప్పగిణిచాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, యోగా మాస్టర్ ఓంకార్, స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీ నీరజా దేవి, కరాటే మాస్టర్ శేఖర్, కలసి మున్సిపల్ కమీషనర్ నిరంజన్ గారికి మరియు వార్డు కౌన్సిలర్ బ్రహ్మ కి వినతి పత్రం అందచేసారారు.

Scroll to Top