మహిళా బిల్లు ముసుగు తొడిగిన దొంగ డి లిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ గాంధీ భవన్ లో తెలంగాణ మహిళా కాంగ్రెస్

Sakshitha news

మహిళా బిల్లు ముసుగు తొడిగిన దొంగ డి లిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ గాంధీ భవన్ లో తెలంగాణ మహిళా కాంగ్రెస్ చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీంభరత్

శంకర్‌పల్లి: సాక్షిత): మహిళా బిల్లు ముసుగు లో బీసీ, బహుజనులతో పాటు దక్షిణ భారత ప్రజలను దోచుకోడానికి బీజేపీ తెచ్చిన కుట్రపూరిత బిల్లు వెనక ఉన్న మోసాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు గుర్తించాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతి బీమ్ భరత్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయానికి బిల్లులో ఉన్న కుట్రను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున తెలంగాణ నుంచి పోస్ట్ కార్డ్ లను పంపే ఉద్యమానికి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పిలుపు మేరకు వారి నాయకత్వంలో కార్యక్రమాన్ని గాంధీ భవన్ వేదికగా నిర్వహించడం జరిగిందని శ్రీజ్యోతి భీమ్ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top