ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో 2వ ర్యాంక్

Sakshitha news

ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో 2వ ర్యాంక్, పల్నాడు జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించిన చిలకలూరిపేట మునిసిపల్ DE షేక్ రహీం కుమార్తె షేక్ షాజియా ను అభినందించి, సత్కరించిన మాజీ మంత్రి , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …
అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ప్రతి అడుగునూ జాగ్రత్తగా వేస్తూ, లక్ష్యంతో చదివితేనే విజయం వరిస్తుందని, కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా విద్యార్థులు చిన్ననాటి నుంచే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అయన అన్నారు…

Scroll to Top