కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్, ఆయన భార్య దివ్యల ఆత్మహత్య ఘటనలో కంటతడి పెట్టించే విషయాలు

Sakshitha news

కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్, ఆయన భార్య దివ్యల ఆత్మహత్య ఘటనలో కంటతడి పెట్టించే విషయాలు

కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్త చంద్రశేఖర్‌కు, తండ్రి సమ్మయ్యకు ఫోన్ చేసి బలవన్మరణానికి పాల్పడిన భార్య దివ్య(30)

అంత్యక్రియలకు ఆమె స్వగ్రామమైన సీతంపేటకు మృతదేహాన్ని తీసుకెళ్లగా.. భర్త చంద్రశేఖర్ వల్లే దివ్య చనిపోయిందని దాడికి దిగిన బంధువులు, గ్రామస్థులు

వారి నుండి చంద్రశేఖర్‌ను కాపాడి ఒక గదిలో ఉంచి తాళం వేసిన దివ్య తండ్రి సమ్మయ్య

దివ్య కర్మకాండలు నిర్వహించే సమయంలో కూడా.. తాను చనిపోతానని, తనకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని రోదించిన చంద్రశేఖర్

ఇద్దరు కుమారులను చూస్తూ రోదిస్తూ, భార్య తన వల్లే చనిపోయిందని తీవ్ర మనోవేదనకు గురై అత్తారింట్లోనే చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్

చంద్రశేఖర్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి.. అనంతరం దివ్యకు అంత్యక్రియలు నిర్వహించిన చోటే అతనికి అంత్యక్రియలు నిర్వహించిన బంధువులు

Scroll to Top