కాంగ్రెస్ పార్టీలో చేరిన తాటిపాముల సర్పంచ్ వార్డు సభ్యులతొ పాటు 80 మంది

Sakshitha news

కాంగ్రెస్ పార్టీలో చేరిన తాటిపాముల సర్పంచ్ వార్డు సభ్యులతొ పాటు 80 మంది బిఆర్ఎస్ నాయకులు చేరిక

సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన శాసనసభ్యులు మేఘారెడ్డి
సంక్షేమ పథకాల అమలు కు ఆకర్షితులై పార్టీలో చేరిక సర్పంచ్ వార్డు సభ్యులు స్పష్టీకరణ
సాక్షిత వనపర్తి డిసెంబర్ 31*వనపర్తి నియోజకవర్గంలోని
శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామ సర్పంచ్ శిరీష మద్దిలేటి వార్డు సభ్యులు రేణుక సురేష్, ఆంజనేయులు, అలివేలమ్మ లు, మండలాధ్యక్షులు రాములు యాదవ్ ఆధ్వర్యంలో వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉంటుందని స్వేచ్ఛగా ఉండవచ్చునని ఎమ్మెల్యే సూచించారు
సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తను సర్పంచ్ గా గెలుపొందానని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై, గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, నేడు పలువురు వార్డు సభ్యులతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు శిరీష మదిలేటి పేర్కొన్నారు

10 సంవత్సరాలు BRS పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయని, నేడు ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు
..అలాగేతాటిపాముల గ్రామానికి చెందిన 80 మంది BRS నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు_

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో BRS గ్రామ మాజీ అధ్యక్షులు వెంకటస్వామి, బాబు, చక్రవర్తి, వై రాములు గారితో పాటు మరో 80 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు

కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిలేటి NSUI బాలరాజు, ఎల్ల స్వామి, కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నారు

Scroll to Top