హైదరాబాదులో జరిగే రవన్న పదవ వర్ధంతి సభను జయప్రదం చేయండి….

Sakshitha news

హైదరాబాదులో జరిగే రవన్న పదవ వర్ధంతి సభను జయప్రదం చేయండి….

ఈసంపల్లి రాజేందర్
టియుసిఐ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి….

సాక్షిత పెద్దపల్లి //గోదావరిఖని కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ఆలియాస్ రవన్న పదవ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ గోదావరిఖనిలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, టి యు సి ఐ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ హాజరై మాట్లాడుతూ… కామ్రేడ్ రవన్న వర్ధంతి 10వ. తేదీ మూడో నెల 2026 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాదులో జరుగుతుంది. ఖమ్మం జిల్లా పోరాట కౌగిళ్ళ లోంచి విప్లవ శక్తిగా శ్రమికుడుగా ఎదిగిన ఎదిగినాడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నాయకుడిగా కామ్రేడ్ రవన్న ప్రజాపంథా బాటను నమ్మి ఆచరించాడు, అతివాద మితవాద విధానాలను వ్యతిరేకించాడు.

ప్రతి కమ్యూనిస్టు ప్రజలతో మరింత సన్నిహితంగా అభిమాన నాయకుడి లాగా ఎదగాలని కోరుకున్నాడు తన ప్రత్యేక కృషి ద్వారా ఎందర్నో కార్యకర్తలుగానూ, నాయకులుగాను, సాన్భూతిపరులుగాను తయారు చేశాడు, నిత్యం నిత్య కృషి శీలుడు జీవితాన్ని విప్లవానికి స్వార్ధకతగా మార్చుకున్నాడు. 1984 సైజ్ గాంధీ పోరాటంలో 20 సంవత్సరాల సమీక్ష అడవి ఉద్యమం పాటల ఆచరణలో ఆ తర్వాత ప్రజాపంథా రాజకీయాలలో ఆయనదొక ముఖ్య పాత్ర పార్టీకి దాదాపు 26 ఏళ్లు పైగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసే పని చేశారు.

కేంద్ర కమిటీ సభ్యుడిగా రెండు శతాబ్దాలు పైగా పనిచేశాడు కొంతకాలం పాటు పోల్టి బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నాడు 16లో మార్చి 9 వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ తో స్టాకు గురై చనిపోయాడు చనిపోయేనాటికి కామ్రేడ్ రవన్న వయసు 68 సంవత్సరాలు కామ్రేడ్ రవన్న ఆశించిన విశ్వసించిన సోషలిస్టు సమాజం స్వప్నం నూతన ప్రజాస్వామిక ఆశయం ఉన్నతమైనది. కామ్రేడ్ రవన్న బోధనల ద్వారా మనకు అర్థమవుతున్నది పాసిస్తూ, పడగల బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు స్వైర విహారం చేస్తున్న సమయంలో కామ్రేడ్ రవన్న పదో వర్ధంతిని జరుపుకుంటున్నాం దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక పోరాటాన్ని అలాగే బలమైన సైదా అధిక విప్లవ పోరాట ఉద్యమాన్ని నిర్మించడమే మన కర్తవ్యం గా తీసుకోవాలని కోరుతున్నాం, రేపు హైదరాబాదులో జరిగే రవన్న పదవ వర్ధంతి సభను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా నాయకులు గొల్లపల్లి చంద్రయ్య, ఆడెపు శంకర్, మార్త రాములు,గుమ్మడి వెంకన్న తీగుట్ల రాములు,మాటేటి పోషం, ఇనుగాల రాజేశ్వర్, కలువల రాయమల్లు, కృష్ణ స్వామి,నాని, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top