శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి సందర్బంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని
రాఘవేంద్ర కాలనీ లో శ్రీ ఆర్య క్షత్రియ సంఘo వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి సందర్బంగా శ్రీ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తదుపరి..
శ్రీరామ్ నగర్ కాలనీ(గాయత్రి నగర్) లో బీజేపీ నాయకులు పాపయ్య దొర ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో పాల్గొని శ్రీ ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం..
శ్రీనివాస్ నగర్ లో బీజేపీ నాయకులు శ్రవణ్ బోస్ మరియు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివజీ మహారాజ్ జయంతి వేడుకలలో పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి భారతదేశం కోసం శివాజీ మహారాజ్ చేసిన సేవలను గుర్తు చేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో శ్రీ ఆర్య క్షత్రియ సంఘo సభ్యులు,వివిధ కాలనీల వాసులు,జీడిమెట్ల డివిజన్ కీ సంబందించిన బీజేపీ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

