పల్నాడులో ఇంటర్ పరీక్షలకు 49 పరీక్ష కేంద్రాలు

Sakshitha news

పల్నాడులో ఇంటర్ పరీక్షలకు 49 పరీక్ష కేంద్రాలు

పల్నాడు జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి లీలావతి తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. మొత్తం 814 మంది ఇన్విజిలేటర్లను నియమించి పర్యవేక్షణ కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షలు రాయడానికి అవసరమైన సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.

Scroll to Top