కోటప్పకొండ: గిరి ప్రదక్షిణ రోడ్డుకు నిధులు మంజూరు.

Sakshitha news

కోటప్పకొండ: గిరి ప్రదక్షిణ రోడ్డుకు నిధులు మంజూరు..

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి భక్తుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.38.60 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎమ్మెల్యే అరవింద్ బాబు చేసిన విన్నపానికి డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ నిధులు విడుదల కావడంతో భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Scroll to Top