జనసంద్రంగా మహాజాతర.. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క- సారలమ్మ
- మేడారం మహాజాతర కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మేడారం జనసంద్రంగా మారింది. దీంతో అక్కడి రహదారులన్నీ రద్దీగా మారాయి. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు.

