దేశప్రజలందరు జాతి మత ప్రాంతీయ కలహాలను విభేదాలను

Sakshitha news

దేశప్రజలందరు జాతి మత ప్రాంతీయ కలహాలను విభేదాలను విడనాడి ఉగ్రవాదంపై యుద్ద చెయ్యాలి – అంబాసిడర్ డా ll ఆకుల సతీష్ ఇంటర్నేషనల్ హ్యూమన్రైట్స్ కమీషన్……… నానాటికి తీవ్రమవుతున్న మత జాతి ప్రాంతీయ విభేదాలు భారతదేశ అంతరంగిక భద్రతకు శాంతి భద్రతలకు మానవ హక్కులకు తీవ్ర విఘాతాన్ని కల్గిస్తున్నాయని విచ్చిన్నకర పరిస్థితిలో దేశప్రజలందరు ఒకే దేశం మతం జాతి ప్రాంతం అదే భారతదేశం అన్న నినాదంతో మతోన్మాద తీవ్రవాద శక్తులను అణచివేయాలని సమైక్యభారతదేశాన్ని ప్రపంచానికి చాటాలని ఆకుల సతీష్ దేశప్రజలకు పిలుపునిచ్చారు ఢిల్లీలో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని డిమాండ్ చేశారు భాధిత కుటుంబాలకు తన ప్రఘాడ సానుభూతి తెలియజేస్తూ మరణించిన వారికుటుంబానికి 2కోట్లు గాయపడిన వారికి 1కోటి నష్టపరిహారం కేంద్రప్రభత్వం వెంటనే అందించి కుటుంబానికి ఒక కేంద్రప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు

Scroll to Top