సచివాలయంలో కొనసాగుతున్న వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష.

Sakshitha news

అమరావతి:

సచివాలయంలో కొనసాగుతున్న వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష.

చంద్రబాబు, ముఖ్యమంత్రి

రైతు సేవా కేంద్రాలను రీ-ఓరియంటేషన్ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలి.

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు సేవలందించేలా రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దాలి.

రైతులకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఆర్ఎస్కేలే కీలక పాత్ర పోషించాలి.

మంచి పోషక విలువలు అందించటం ద్వారా భూసారం పెంచాలి… దాని ద్వారా ఉత్పాదకత పెంచాలి.

2026 ఖరీఫ్ సీజన్లో సేంద్రీయ సాగు చేసేలా, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలి.

ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణంతో పాటు ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా జరిగే ప్రయోజనాలు రైతులకు వివరించాలి.

ఎలాంటి మార్పులు జరగాలన్నా… క్షేత్రస్థాయిలో ఉండేవారికి పూర్తి స్థాయి అవగాహన ఉండేలా చూడాలి.

భూసారం పెంచే పోషకాల విషయంలో లోపాలను సవరించి తదుపరి ప్రణాళికలు చేసుకోవాలి.

Scroll to Top