ఖమేనీ హత్యపై మోదీ మాట్లాడాలి: రాహుల్ గాంధీ
ఖమేనీ హత్యపై మోదీ మాట్లాడాలి: రాహుల్ గాంధీ
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మౌనంగా ఉండటం వల్ల ప్రపంచంలో భారతదేశ స్థాయి తగ్గుతుందని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అశాంతి నెలకొన్న ప్రాంతాలను అతిపెద్ద ఘర్షణ వైపు నడిపిస్తున్నాయని, కోట్లాది మంది అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఇరాన్పై, ఇతర పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాలని, హింస హింసనే పుట్టిస్తుందని, చర్చలు, సంయమనం పాటించడమే శాంతికి ఏకైక మార్గమని ఆయన అన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
