కోడవటంచ లక్ష్మి నరసింహ స్వామి వారికి దర్శించుకున్న ఎమ్మెల్యే నాగరాజు దంపతులు…
భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిధి లోని కోడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహ పున:ప్రతిష్ట మరియు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానం మేరకు నేడు కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
తొలుత ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు..
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆశీర్వదించగా ఆలయ ఛైర్మన్ నాయినేని సంపత్ రావు కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు..
అనంతరం స్థానిక ఎమ్మెల్యే తో కలిసి ఆలయ పున్న నిర్మాణ పనులను ఆలయ విశిష్టతను ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు వివరించారు…
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY