మగ్గిడి మహేందర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు …
గ్రేటర్ వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ పరిధిలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మగ్గిడి మహేందర్ అనారోగ్యంతో మరణించగా వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
అనంతరం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మార్గం ప్రసాద్ ఇటీవల మరణించగా వారి నివాసానికి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు…
ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY