కొలన్ సులోచన మృతికి మల్లు రవి, హరివర్ధన్ రెడ్డి సంతాపం

Sakshitha news

కొలన్ సులోచన మృతికి మల్లు రవి, హరివర్ధన్ రెడ్డి సంతాపం

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మాతృమూర్తి, కీ.శే. కొలన్ సులోచన నిన్న అకాల మరణం చెందడంతో, గురువారం ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు విచ్చేసి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి మరియు మేడ్చల్–మల్కాజ్‌గిరి మాజీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కొలన్ హన్మంత్ రెడ్డి ని పరామర్శించి, సులోచనమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

సులోచన మృతి పట్ల వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు

ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు