సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతీకగా హరియాలి తీజ్ వేడుకలు….
రామగుండం ఎన్టీపీసీ లో ఉత్సాహంగా మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : ఎన్టీపీసీ రామగుండం పరిధిలోని కాకతీయ ఫంక్షన్ హాల్లో హరియాలి తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు శ్రీమతి రాఖీ సమంతతో పాటు సమితి సభ్యులు, టౌన్షిప్ నివాసితులు వేడుకల్లో పాల్గొన్నారు.
హరియాలి తీజ్ పండుగ విశిష్టతను ప్రతిబింబించేలా మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. సంప్రదాయాలను కొనసాగిస్తూ మహిళల మధ్య స్నేహభావం, ఐక్యతను మరింత బలోపేతం చేసేలా వేడుకలు సాగాయి.
వేడుకల్లో మహిళలు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో కాకతీయ ఫంక్షన్ హాల్ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆనందోత్సాహాల మధ్య వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం ఎన్టీపీసీ రామగుండం సమాజంలోని సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యతను చాటిచెప్పింది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
