ప్రతి విద్యార్థి ప్రభుత్వ విధాన విశ్లేషణపై అవగాహన కలిగి ఉండాలి………….. కే.ఉమా లెక్చరర్
*సాక్షిత వనపర్తి:
ప్రభుత్వ విధాన విశ్లేషణపై ప్రతి విద్యార్థిని,విద్యార్థులకు పూర్తిగా అవగాహన ఉండాలని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకులు కే.ఉమా అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విస్తృత ఉపన్యాసకులు డాక్టర్.ఎల్. పుష్ప ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… ప్రభుత్వంలో ఉన్న చట్టాలు,పాలన విధానము ఏవిధంగా చేయబడతాయి, మేధో మతనం ఏవిధంగా చేయబడుతుందని, చట్టాల ఏవిధంగా రూపకల్పన చేయాలి అనే అంశాలపైన వివరంగా విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్. ఈశ్వరయ్య,వైస్ ప్రిన్సిపాల్ రామరాజు యాదవ్,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్ కే.ఉమా,పొలిటికల్ సైన్స్ విస్తృత ఉపన్యాసకులు ఎల్. పుష్ప,అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్. దామోదర్ రెడ్డి, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
