ఆపదలను తొలగిస్తూ అభయాన్నిచ్చే దైవం ఆంజనేయస్వామి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
125 – గాజుల రామారం డివిజన్ పి.పి.నగర్ లో నూతనంగా నిర్మించిన సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభన కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆపదలను తొలగిస్తూ అభయానిచ్చే దైవం ఆంజనేయస్వామి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలన్నారు. దేవాలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులకు నా అభినందనలు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్ రావు, పి.శ్రీనివాస్ రెడ్డి, చంద్రకాంత్, వివేక్, వెంకట్ రెడ్డి, భీమేశ్వర్ రావు, బాబా, నాయుడుస్ శ్రవణ్, డివిజన్ అధ్యక్షులు పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, ఇమ్రాన్ బేగ్, తెలంగాణ సాయి, సుంకరి చందు, మూసా ఖాన్, చెట్ల వెంకటేష్, దూలప్ప, ఆంజనేయులు, బోయిని మహేష్, రాములు గౌడ్, చిన్నా చౌదరి, బాబీ చౌదరి, దండుగుల నవీన్, శ్రవణ్, సయ్యద్ రంజాన్, ప్రసాద్, శివా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
