తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా తూప్రాన్ మున్సిపాలిటీకి అబ్జర్వర్ గా టిపిసిసి ఉపాధ్యక్షులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ విచ్చేసి మున్సిపాలిటీలోని 12, 13, 14, 15 వార్డులకు అభ్యర్థులుగా ఉన్న స్వప్న, రాధికా శ్రీనివాస్, సబితా నగేష్, అన్నపూర్ణ తదితర అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి తూప్రాన్ మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కొప్పిశెట్టి దినేష్ కుమార్, ఘంటా శ్రీనివాస్ గౌడ్, స్థానిక నాయకులు ఎలక్షన్ రెడ్డి నందాల శ్రీనివాస్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY