బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ కి. శే రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ ప్రధాని స్వర్గీయ కి. శే రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పుల మల వేసి ఘణ నివాళుల్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . అంనతరం హన్మంతన్న మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, బహదూర్ పల్లి మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, INTUC నాయకులు నర్సింగ్ రావు, మల్లికార్జున్ , శామీర్పేట్ ప్రకాష్ , ఎండి ఉస్మాన్, షఫీ, దుడ్డు రాహుల్, శైలజ, చంద్ర కల మరియు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
