మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు……
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల విలేజ్లో పరిధిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
దేశానికి మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, సత్యం, త్యాగ భావనలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అమలు చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గాంధీజీ కలలుగన్న స్వతంత్ర భారతాన్ని నిజం చేయడమే మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యకర్మంలో డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్, డా|| . ఆ.బి.జె.జేమ్స్, డివిజన్ అద్యక్షులు బేకు శ్రీనివాస్, ఎస్.పండరి రావు, సొమన్న శ్రీధర్ రెడ్డి, బి.శివకుమార్, ఎం.డి .లాయక్, ఎం.డి.జాకీర్, సంతోష్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ బాలప్ప , రంగన్న, సిద్ధనోల సంజీవ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, ప్రవీణ్ , ఆకుల హరికిరణ్, డి.నాగిరెడ్డి, కరణ్, చందు, రాజు చారి, గఫ్ఫార్, ఖలీమ్ , పెంటయ్య ముదిరాజ్, అనిల్, జి.అంజనేయులు, సంతోష్ చారి, పిట్ల ప్రవీణ్ కుమార్, బి.ఆర్.లక్ష్మణ్, ఆనంద్ కుమార్, బి.దశరథ్, సత్యనారాయణ, సంతోష్ కుమార్లక్ష్మి, నాగలక్ష్మి, రేవతి తదితరులు పాల్గొన్నారు .

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY