కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరధిలోని 290 డివిజన్ సుభాష్ నగర్ లోని ఆటో స్టాండ్ జంక్షన్ వద్ద సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా KKM ట్రస్ట్ చైర్మన్ & కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు..
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... స్వామి సుభాష్ చంద్రబోస్ జీవితం ఈనాటి యువతరానికి మార్గదర్శకం అన్నారు... అలాగే వారు స్వాతంత్ర ఉద్యమంలో వారు చేసిన పోరాట పటిమ ఎనలేనిదని చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేదని పేర్కొన్నారు, నేటి యువతకు సుభాష్ చంద్రబోస్ జీవితం ఒక స్ఫూర్తిదాయకం మరియు ఒకఆదర్శం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోనేటి నాగేశ్వరరావు , వీరేశం , డివిజన్ జనరల్ సెక్రెటరీ నాగిరెడ్డి డివిజన్ మహిళ అధ్యక్షురాలు తులసి , ఆటో యూనియన్ అధ్యక్షుడు విజయ్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు దాత్రిక శ్రీనివాస్, రంగనాథ్, జగదీష్, పరుశరాములు, త్రిమూర్తులు సోలేమన్ తదితరులు పాల్గొన్నారు...

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY