అనారోగ్యంతో ఓ విద్యార్థి మృతి
సాక్షిత :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో జరిగింది.
అశ్వారావుపేటలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పేటమాలపల్లికి చెందిన ఎన్. లౌకిక కొద్దిరోజులుగా ఫీట్స్ తో బాధపడుతుంది. కుటుంబీకులు వైద్యశాలలో చికిత్స చేయించారు. ఫిట్స్ వచ్చి ఆసుపత్రికి తరలించే లోపే పరిస్థితి విషమించి విద్యార్థి మృతి చెందింది. విద్యార్థి మరణించడం చాలా బాధాకరమైన విషయం అని హెచ్ఎం స్కూల్ కి ఒక్కరోజు సెలవు ఇచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
