అమరావతి : వైసీపీ నేతల వెంట తమ పిల్లల్ని పంపించే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి.
డ్రగ్స్, గంజాయి వ్యాప్తి చేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తత అవసరం.. డ్రగ్స్ వద్దు బ్రో నినాదాలతో ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది.
జగన్ నేతృత్వలో వైసీపీ ఇంకా డ్రగ్స్ తీసుకో బ్రో అని ప్రోత్సహిస్తుంది.. విద్యార్థులు, యువత జీవితాలను నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారు.
డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన కొండారెడ్డి నేతృత్వంలో జగన్ శిక్షణ కార్యక్రమాలా?.. కొండారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అతనితో జగన్ సమావేశాలా?
రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చూసేందుకు మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.. డ్రగ్స్కు కేంద్రంగా చేసేందుకే జగన్ విశాఖను రాజధాని చేస్తా అన్నారా?
ఆడబిడ్డల్ని కించపరిచేలా సాక్షి మీడియాలో ప్రచారం చేసే కథనాలు దుర్మార్గం.
ఆడబిడ్డలపై తప్పుడు రాతలు రాసే వారిపై కేసులు నమోదు చేస్తాం : హోంమంత్రి వంగలపూడి అనిత

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
