ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం : లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అశ్వారావుపేట పోలీస్ హెచ్చరిక
సాక్షిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలంలో
మొంథా తుఫాన్ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డిడిఆర్ఎఫ్ సిబ్బంది అశ్వారావుపేటలో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపోయే ప్రాంతాలను డి డి ఆర్ ఎఫ్ సిబ్బందితో అశ్వారావుపేట సిఐ పి. నాగరాజు రెడ్డి, ఎస్ఐ టి.యయాతి రాజు మరియు సిబ్బంది పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచనలు చేశారు. మండల ప్రజలకు ఎటువంటి అవసరమైన వెంటనే పోలీసుకు సమాచారం అందించవలసిందిగా సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY