ఏపీలో అక్టోబర్ 13 నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు
ఏపీలో మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త టీచర్లకు అక్టోబర్ 3-10 వరకు ట్రైనింగ్ సెషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ సమయంలోనే కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వనుంది. 13 నుంచి విధులకు హాజరు కావాలని సూచించింది. మరోవైపు మెగా DSC తుది జాబితాపై అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 25 వరకు తెలుపవచ్చని అధికారులు పేర్కొన్నారు. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి కమిటీలు ఫిర్యాదులను పరిష్కరిస్తాయని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
