వైసీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నల్లపరెడ్డి..
సాక్షిత : నెల్లూరు జిల్లానేడు మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర పి ఎ సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు లోని తన నివాసంలో కోవూరు నియోజకవర్గంలోని నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో.ఈనెల 12-06-2026 కోవూరు మండలం, చిన్న పడుగుపాడు లోని రుక్మిణి కళ్యాణం మండపంలో జరగబోయే కోవూరు నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లతో (యస్. ఐ. ఆర్) పై అవగాహన సదస్సు కార్యక్రమం పై నియోజకవర్గం లోని నాయకులతో చర్చించడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.మాజీ మంత్రి, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు డా. మద్దిల గురుమూర్తి పాల్గొనెదరు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
