పులివెందులలో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ప్రజాస్వామ్య వికాసం
సాక్షిత : పులివెందుల లో జడ్పీటీసీ ఎన్నికల్లో NDA కూటమి భలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి మరెడ్డి లతారెడ్డి 6052 ఓట్ల మెజారిటీ తో గెలుపొందడం హర్షించదగ్గ విషయం.
1978 సంవత్సరం తర్వాత పులివెందులలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొనలేదని పల్నాడు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేసారు.అలాగే ఎస్టి, ఎస్సి,బిసి,మైనారిటీ ప్రజలలో ఎక్కువమంది గత 47 సంవత్సరాల నుండి ఓటు వేయలేదంటే పులివెందుల ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఏరకంగా వర్ధిల్లిందో తెలుస్తుంది.47 సంవత్సరాలు తర్వాత నిన్న జరిగిన పులివెందుల జడ్పిటిసి ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వికాసానికి దోహదపడిన పులివెందల ఓటర్ మహాశయులకు బీజేపీ పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నిక నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్న పల్నాడు జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
