లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||
(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) 129 డివిజన్ షాపూర్ నగర్ వాసులు టి.ప్రవళిక గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ చికిత్సకు సరిపడా స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం 2,5౦౦౦౦ ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) LOC మంజూరు చేయించారు మరియు నిజాంపేట్ వాసులు పి. కీర్తి కి 20000/-CMRF చెక్ మంజూరు చేయించారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ సిద్దనోల సంజీవ రెడ్డి, లక్ష్మణ్ అజాం తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
