కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గ మొట్టమొదటి శాసనసభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ రాఘవేంద్ర కాలనీలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జీడిమెట్ల సర్కిల్ కాంగ్రెస్ పార్టీ BLA లు మరియు ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అంశాలపై స్థానిక నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి , భూపతి రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


