దేశభక్తి నినాదాలతో మార్మోగిన రామగుండం
ఎన్టీపీసీ….
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వందేమాతరం గానం….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం ఎన్టీపీసీ/ : భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో స్టెయిర్ క్లెయిర్ పాఠశాలలో ఘనంగా సామూహిక వందేమాతరం గానం, ‘వందేమాతరం’ డిజైన్ ఫార్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్అండ్టీ) చందన్ కుమార్ సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీపీసీ ఉన్నతాధికారులు, ప్రముఖ అతిథులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుమారు 1,500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్టీపీసీ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటారు. విద్యార్థులు మైదానంలో అద్భుతంగా ‘వందేమాతరం’ ఆకృతిని ఏర్పాటు చేసి దేశానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం అందరూ కలిసి దేశభక్తి భావనతో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఐక్యత, దేశభక్తి, జాతీయ గర్వాన్ని ప్రతిబింబించింది. దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించడంతో పాటు, బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
వందేమాతరం గానంతో స్టెయిర్ క్లెయిర్ పాఠశాల ప్రాంగణం దేశభక్తి భావంతో మార్మోగింది.


