భారీ వర్షాల నేపథ్యంలో పాత బజారులో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యటన….

Sakshitha news

భారీ వర్షాల నేపథ్యంలో పాత బజారులో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యటన….

ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలకు ఆదేశం….

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, జూలై 29: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పాత బజారు ప్రాంతాన్ని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. వర్షాల కారణంగా ఏర్పడిన నీటి నిల్వలు, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నీటి నిల్వలను వెంటనే తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించి వరద నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భారీ వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

Scroll to Top