వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన

Sakshitha news

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్(కుత్బుల్లాపూర్ డివిజన్ – పద్మా నగర్ డివిజన్ )పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీడిమెట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తో కలిసి జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో కొనసాగుతున్న వర్షపు నీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను పరిశీలించి,అలాగే గాయత్రి నగర్, శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

Scroll to Top