కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో షాబాద్లోని వారి నివాసానికి కాంగ్రెస్ నాయకులతో వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మాతృవియోగంతో తీవ్ర విషాదంలో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి ని, వారి సోదరుడు మహేందర్ రెడ్డి ని ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంగా రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

