కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న జరిగిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం మరియు BLA నియామక సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి BLA లు ముఖ్యపాత్ర నిర్వహిస్తారని తెలిపారు.కావున కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమం పార్లమెంట్ ఇంచార్జి గా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ , నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఎ పి మిథున్ రెడ్డి ,సమీర్ కౌశల్ , జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్,జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి ,జిల్లా మహిళా కాంగ్రెస్ అడ్జ్యక్షురాలు లక్ష్మి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
