SAKSHITHA NEWS

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొత్త పెన్షన్ లను పంపిణీ చేసిన మంత్రి ఆర్కే రోజా

సాక్షిత : వడమాలపేట మండలం నకు సంబందించి కొత్తగా మంజూరు అయిన 270 అర్హులకు పెన్షన్ లను వడమాలపేట మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణం లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి శ్రీమతి ఆర్కే రోజా మంజూరు చేశారు.

270 మంది అర్హులకు రూ.7.01.600.00 లను అందించారు.

మొత్తం మండల పెన్షన్ దారులు 4948 మంది. వీరికి నెలకు రూ.1,24,71000.00 లను ఈ ప్రభుత్వం అందిస్తుంది.
ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూ.448.95 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఈ మండలానికి మాత్రం YSR పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ నగదు ను అందించారని వివరాలు తెలిపారు.


SAKSHITHA NEWS