SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత దినపత్రిక

చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెలిమినేడు గ్రామంలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ
పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా మొదటగా గుర్తొచ్చేది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పేద, బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్సార్ అని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్, రైతు రుణమాఫీ,104,108 ఇలాంటి పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరెగూడెం గ్రామం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగంపల్లి కిషోర్ చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ నాయకులు శిరబోయిన శ్రీనాథ్ యాదవ్ ఓబిసి మైనార్టీ సెల్ ఎండి జావిద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంతటి శ్రీనివాస్ బుట్టి పెంటయ్య పల్లె మల్లేష్ మహంకాళి లింగయ్య మేడి యాదయ్య గోలే శంకరయ్య ఆదిపెల్లి యాదయ్య సుంకరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS