SAKSHITHA NEWS

రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం

రైతులకు అండగా ఎల్లవేళలా తమ ప్రభుత్వం ఉంటుందని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు.శ్రీకాకుళం నగరంలోని శుక్రవారం స్థానిక బాపూజీ కళామందిరంలో యంత్ర సేవా పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మంత్రి ధర్మాన మాట్లాడారు. వ్యవసాయదారుల్లో ఉండే సంతోషం నేడు లేదని, కారణం పండించిన ఉత్పత్తికి అనుగుణంగా గిట్టుబాటు ధర పెరగడం లేదన్నారు.వ్యవసాయానికి అవసరమైన అన్ని ధరలూ పెరిగాయన్నారు.రైతుకు ఏమి మిగలడం లేదని, ఇలాంటి నేపథ్యంలో రైతులకు అండగా ఉండాలని, వైఎస్ఆర్ నాటి నుంచి నేడు జగన్ వరుకు అంతా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు.


SAKSHITHA NEWS