SAKSHITHA NEWS

Who sold it? Who bought it? Students of Kojjaguda Anganwadi

అమ్మినది ఎవరు ? కొన్నది ఎవరు …? కొజ్జగూడ అంగన్వాడీ విద్యార్థులు …
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సాక్షిత శంకరపల్లి : శంకరపల్లి మండల పరిధి కొజ్జగూడ గ్రామనికి చెందిన జొన్నాడ నర్సింలు అనే అతను గ్రామానికి చెందిన సర్వే నంబర్ 85 స్మశానా వాటిక మరియు ప్రభుత్వ పాఠశాల ,అంగన్వాడీ భవనాలతో పాటు ఒక గుడి భూములని జొన్నాడ నర్సింలు కొన్ననాని తనదని అంటూనాడని గ్రామస్తులు తెలియజేశారు .ఈ భూమి అంత అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ దొరకు సంబంధించిన భూమిని తరాల కిందట స్మశానా వాటిక కు కేటాయిస్తూ మౌకికంగా తెలిపారు అని అన్నారు. నర్సింలు అనే అతను అక్రమంగా భూమి ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అన్నారు.ఈ సందర్భంగా అంగన్వాడి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అమ్మినది ఎవరు , కొన్నది ఎవరు , మా పాఠశాల జోలికి రావొద్దు అని నినాదాలు చేశారు


SAKSHITHA NEWS