SAKSHITHA NEWS

సిబ్బంది సంక్షేమమే పరమావధిగా పనిచేస్తాం
-పోలీస్ గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్
రాజమహేంద్రవరం, సాక్షిత :

రాజమహేంద్రవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్ నందు శుక్రవారం జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేసే రిటైర్డ్ అయిన వారికి మరియు మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు గ్రీవెన్స్ నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ నందు లేకపోయినా మనమంతా పోలీస్ కుటుంబమేనని, నేను కూడా మీ కుటుంబంలో ఒకడినేనని భావించాలని, రిటైర్డ్ మరియు మరణించిన పోలీసు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నేరుగా తనను సంప్రదించాలని, వారికి రావలసిన బెనిఫిట్స్ ను తక్షణమే వారికి అందేలాగా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.వారి సమస్యలను సంబంధిత అధికారుల సమక్షంలోనే అడిగి తెలుసుకుని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు చేశారు. సిబ్బంది సంక్షేమమే పరమావధిగా పనిచేస్తామన్నారు.
ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) అల్లూరి వెంకట సుబ్బరాజు, అడిషనల్ ఎస్పి (అడ్మిన్)ఎస్. రాజశేఖర్ రావు, అడిషనల్ ఎస్పీ(ఏ ఆర్) ఎల్. చెంచి రెడ్డి, డీఎస్పీలు, ఆర్ ఐ లు, పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. రఘురాం, ఇతర అసోసియేషన్ సభ్యులు మరియు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS