SAKSHITHA NEWS

Vikarabad MLA who visited Kali Yuga Lord Tirumala Sri Venkateswara Swamy

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత : పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో కలసి వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” , తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

వికారాబాద్ జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకోవడం జరిగినదని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS