SAKSHITHA NEWS

బైరాన్ పల్లి ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….

హనుమకొండ జిల్లా…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగు పథకాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని సదుద్దేశంతో నేడు హసన్పర్తి మండల పరిధిలోని బైరాన్ పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ:-

రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియన్నారు.రాష్ట్రంలో 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఆరు లక్షల రేషన్ కార్డులు కట్ చేసి 40 వేల రేషన్ కార్డులు ఇచ్చారన్నారు.మన ప్రజా ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు,అప్పులను సరిజేసుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామన్నారు.కొత్త రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నామన్నారు.అదేవిధంగా గత సంవత్సర కాలంలో 20 రోజులు ఉపాధి హామీ పని చేసిన భూమిలేని నిరుపేదలు అందరికీ సంవత్సరానికి 12 వేల రూపాయలు,ఇందిరమ్మ ఇల్లు,ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు.గుట్టలకు కొండలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కాకుండా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి రూ.12000/- ఇవ్వబోతున్నాము…

మొదటి దశలో సొంత స్థలం కలిగి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలతో కట్టిస్తామన్నరు.ఈ నాలుగు రోజులపాటు జరిగే ప్రజా పాలన గ్రామసభలలో ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి,ఇందిరమ్మ ఇండ్లకి దరఖాస్తు పెట్టుకుంటే వాటిని కూడా పరిశీలించి గుర్తిస్తామన్నారు.ఈ కార్యక్రమాలన్నీ నిరంతరంగా జరుగుతాయి,ఈ జనవరి 26 కు కొంత మందికి మిగతా వారికి దశలవారీగా ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయబోతున్నాం.ఎలక్షన్లో మాట ఇచ్చినట్టు 2 లక్షల వరకు రుణమాఫీని 22,000 కోట్లతో చేశామన్నారు.200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అర్హులందరికీ అందిస్తున్నామని,మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి ప్రతినెల 300 కోట్లు కడుతున్నాం.గ్యాస్ సిలిండర్లు 500లకే ఇస్తున్నామన్నారు.ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశీస్సులతో ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నామన్నారు…

అలాగే మీకు ఏ సమస్య ఉన్న కానీ పథకాలు రేషన్ కార్డులు ఎల్, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ఎవరైనా డబ్బులు అడిగిన నా టోల్ ఫ్రీ నెంబర్ 8096107107 కి కాల్ చేసి మీ సమస్యను మాకు తెలియజేస్తే సత్వరమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలియజేయడం జరిగింది….

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగలి వెంకట్రారాం నరసింహ రెడ్డి, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మంద రాజు, మాజీ ఉప సర్పంచ్ కల్లెబోయిన సురేందర్ ముదిరాజ్, బైరాన్ పల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు కల్లెబోయినకుమార స్వామి, మండల మహిళా అధ్యక్షురాలు జొరిక పూలమ్మ, కుమారస్వామి, రామకృష్ణ, యూత్ నాయకులు జట్టి యుగెందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు…..