SAKSHITHA NEWS

Two people were arrested for transporting illegal liquor in the train

రైలులో అక్రమ మద్యం రవాణా ఇద్దరు అరెస్ట్

గుంటూరు, రైలులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని గుంటూరు జిఅర్ పి పోలీసులు అరెస్ట్ చేసారు.

ఎస్ ఐ వేంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం పేరేచర్లకు చెందిన రవికుమార్, సాంబయ్య ఇద్దరు హైదరాబాద్ కు వెళ్లి తెలంగాణా మద్యం తీసుకుని రైలులో గుంటూరుకి చేరుకున్నారు.

ఎస్ ఐ తమ సిబ్బందితో రైల్వేస్టేషన్ లో తనిఖీలు చేయగా ఇద్దరి బ్యాగులో 40 తెలంగాణా మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.


SAKSHITHA NEWS