SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్


ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్.
ఈ సందర్భంగా ఖమ్మం నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు….
ముఖ్యంగా రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా ఖమ్మం నగరంలోని అన్ని మసీదులకు మరమ్మత్తులు చేపట్టాలని, పారిశుధ్యం పాటించాలని,అదే విధంగా రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనీ అంతే కాకుండా నగరంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు….. సానుకూలంగా స్పందించిన కలక్టర్ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఆశ్రీప్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS