SAKSHITHA NEWS

మల్లు వెంకటేశ్వర్లు ప్రకృతి తెలిసిన వైద్యులు, వారి నిష్క్రమణ మల్లు కుటుంబానికి తీరని లోటు: బీపీ నాయక్

వైరా: మల్లు వెంకటేశ్వర్లు కి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు బీపీ నాయక్. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు సోదరులు మల్లు వెంకటేశ్వర్లు ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా వారి స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో ఏర్పాటుచేసిన దశదినకర్మ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క పాల్గొనగా, కాంగ్రెస్ యువనేత బీపీ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరావులతో కలిసి మల్లు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS