సబ్జెక్టు నైపుణ్యత పై అధ్యాపకులకు శిక్షణ
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ ఎలక్ట్రికల్ అధ్యాపకులకు సబ్జెక్టు నైపుణ్యత పై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విభాగం అధ్యాపకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హైదరాబాదులోని సనత్నగర్ లో గల రేడియంట్ ఇన్స్టాప్ టెక్నాలజీలో ఐదు రోజుల పాటు శిక్షణ పొందనున్నారు.ఈ సందర్భంగా వారికి ఎలక్ట్రికల్ కు సంబంధించిన అధునాతన పరికరాలపై అవగాహన కల్పించారు రేడియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోఆర్డినేటర్ ప్రదీప్ ఆధ్వర్యంలో అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నారు. పలు అంశాలపై వారు అవగాహన కల్పించుకుంటున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన తో పాటు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించారు.ఈ శిక్షణలో డా”సతీష్ ,వీరన్న, వీరు,అశోక్,భానుప్రకాష్ లు పాల్గొన్నారు.
సబ్జెక్టు నైపుణ్యత పై అధ్యాపకులకు శిక్షణ
Related Posts
రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ మరియు జ్యోతి నగర్ కాలనీ
SAKSHITHA NEWS రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ మరియు జ్యోతి నగర్ కాలనీ మధ్యలో నూతనంగా 95.00 లక్షల రూపాతీలతో నిర్మిస్తున్న నాలా ను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్ తో కలిసి స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆకస్మిక…
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…