SAKSHITHA NEWS

మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ *

సాక్షిత : సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటును..

నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా సందర్భాన్ని అని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS