SAKSHITHA NEWS

వసుధ కార్మికుల వేతన ఒప్పందంపై యాజమాన్యంతో సమావేశమైన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెం లిమిటెడ్ లో పని చేస్తున్న ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు 60 మందికి వేతన ఒప్పందంపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కంపెనీలో యాజమాన్యంతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్మికులకు న్యాయమైన వేతనం అందించేలా యాజమాన్యం చొరవ చూపాలన్నారు. గత 20 ఏళ్లుగా కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు న్యాయ బద్ధమైన వేతన సవరణ ఒప్పందం చేయాలని కంపెనీ డైరెక్టర్ లను కోరారు. దీంతో వారు సానుకూలంగా స్పందించి చర్చించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు మంతెన అశోక్ రాజు, మంతెన ఆనంద్ మరియు యునియన్ సభ్యులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS