SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రభుత్వ ధ్యేయం.

వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు APSSDC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమం లో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ గారి తో పాటు గా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


SAKSHITHA NEWS